ఈషా రెబ్బా బంగారపు పందెం
వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్లో ఉత్సాహం నింపిన ఈషా రెబ్బ
▪️ శరత్ సిటీ మాల్లో జరుగుతున్న ఘనమైన కార్యక్రమం
హైదరాబాద్: నగరంలోని ప్రముఖ షాపింగ్ కేంద్రం శరత్ సిటీ మాల్ (AMB మాల్, కొండాపూర్)లో వింధ్య గోల్డ్ నిర్వహిస్తున్న సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా రెబ్బ సందడి చేశారు. మే 23 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 25వ తేదీ వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా ఈషా రెబ్బ మాట్లాడుతూ, "ఈ ఈవెంట్ బంగారం వంటి అద్భుతమైన వేడుక. చాలా ఆకర్షణీయంగా, రంగురంగులగా జరుగుతోంది. ఇలాంటి సరికొత్త కార్యక్రమాలు అందరికీ మరపురాని అనుభవాన్ని అందిస్తాయి. వింధ్య గోల్డ్ వంటి విశ్వసనీయ బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం దీని ప్రత్యేకతను మరింత పెంచింది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్తుకు బంగారు హామీలాంటిది," అని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్లో ఈషా రెబ్బ సందర్శకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని, వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఛాలెంజ్లో గెలిచినవారికి బంగారు, వెండి నాణేలను బహుమతులుగా అందించడం ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వింధ్య గోల్డ్, నాణ్యమైన ఆభరణాలను అందరికీ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్కు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచింది. భారీ సంఖ్యలో సందర్శకులు హాజరై ఈవెంట్ను విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.