తెలుగు చిత్ర

Breaking

5/25/2025

5/25/2025

ఈషా రెబ్బా బంగారపు పందెం

 వింధ్య గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో ఉత్సాహం నింపిన ఈషా రెబ్బ

▪️ శరత్ సిటీ మాల్‌లో జరుగుతున్న ఘనమైన కార్యక్రమం

హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ షాపింగ్ కేంద్రం శరత్ సిటీ మాల్ (AMB మాల్, కొండాపూర్‌)లో వింధ్య గోల్డ్ నిర్వహిస్తున్న సిల్వర్ బార్ ఛాలెంజ్ ఈవెంట్‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈషా రెబ్బ సందడి చేశారు. మే 23 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం 25వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ సందర్భంగా ఈషా రెబ్బ మాట్లాడుతూ, "ఈ ఈవెంట్ బంగారం వంటి అద్భుతమైన వేడుక. చాలా ఆకర్షణీయంగా, రంగురంగులగా జరుగుతోంది. ఇలాంటి సరికొత్త కార్యక్రమాలు అందరికీ మరపురాని అనుభవాన్ని అందిస్తాయి. వింధ్య గోల్డ్ వంటి విశ్వసనీయ బ్రాండ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం దీని ప్రత్యేకతను మరింత పెంచింది. వింధ్య గోల్డ్ పర్చేజ్ ప్లాన్ భవిష్యత్తుకు బంగారు హామీలాంటిది," అని పేర్కొన్నారు. ఈ ఛాలెంజ్‌లో ఈషా రెబ్బ సందర్శకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని, వారిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జరిగిన గోల్డ్ – సిల్వర్ బార్ ఛాలెంజ్‌లో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఛాలెంజ్‌లో గెలిచినవారికి బంగారు, వెండి నాణేలను బహుమతులుగా అందించడం ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వింధ్య గోల్డ్, నాణ్యమైన ఆభరణాలను అందరికీ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా తమ బ్రాండ్‌కు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచింది. భారీ సంఖ్యలో సందర్శకులు హాజరై ఈవెంట్‌ను విజయవంతం చేయగా, నిర్వాహకులు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

5/24/2025

5/24/2025

హీరోయిన్ ని ఎందుకు తప్పించారు, హీరో మంచి మనసు నిదర్శనం?

 స్పిరిట్ చిత్రం నుండి దీపికా పదుకొణె ఎందుకు తప్పుకున్నారు?


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రం గురించి ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, దీపికా ఈ చిత్రం నుండి తప్పుకున్నారని తెలుస్తోంది. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని, అవి సినిమా యొక్క కథాంశం, సంస్కృతి, ప్రభాస్ యొక్క రాజా మనసు మరియు అయన యొక్క వ్యక్తిగత నీతి నియమాలతో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు.

సందీప్ రెడ్డి వంగా తన చిత్రాలలో బోల్డ్ సన్నివేశాలు మరియు హద్దులు దాటే దృశ్యాలను చూపించడంలో పేరుగాంచారు. 'అర్జున్ రెడ్డి' మరియు 'అనిమల్' వంటి చిత్రాలు ఈ విషయంలో ఉదాహరణగా నిలుస్తాయి. అయితే, 'స్పిరిట్' చిత్రంలో కూడా ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు ఉండవచ్చనే వార్తలు వచ్చాయి. ఇది ప్రభాస్‌కు అసౌకర్యంగా అనిపించినట్లు తెలుస్తోంది. ప్రభాస్, తన చిత్రాలలో సంస్కృతి మరియు సాంప్రదాయ విలువలకు ప్రాధాన్యత ఇస్తారని అభిమానులు భావిస్తారు. ముఖ్యంగా, తెలుగు సినిమా సంస్కృతిలో, తల్లిగా ఉన్న మహిళలతో రొమాంటిక్ సన్నివేశాలు చూపించడం సాధారణం కాదని, ఇది సాంప్రదాయ హిందూ విలువలకు విరుద్ధమని కొందరు అంటున్నారు.

దీపికా పదుకొణె ఇటీవల తల్లి అయ్యారు. ఈ సందర్భంలో, ఆమె ఒక తల్లిగా ఉన్న నేపథ్యంలో బోల్డ్ లేదా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం సరైనది కాదని ప్రభాస్ భావించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో తల్లులతో రొమాంటిక్ పాత్రలు చేయించటం సర్వసాధారణం అక్కడ వారి ఆచారం, తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం ఇలాంటి సన్నివేశాలు సాంప్రదాయ దృక్కోణంలో అంతగా ఆమోదయోగ్యం కాదని చెబుతారు. హిందూ సంస్కృతి ప్రకారం, రొమాంటిక్ పాత్రలు సాధారణంగా పెళ్లికాని యువతులకు సంబంధించినవిగా చూపించడం సంప్రదాయంగా ఉందని కొందరు నమ్ముతారు.

ప్రభాస్ ఈ విషయంలో తన సాంస్కృతిక విలువలకు కట్టుబడి, సినిమాలో దీపికా పాత్రను తగ్గించాలని లేదా ఆమెను చిత్రం నుండి తప్పించాలని సూచించినట్లు సమాచారం అని వినిపిస్తోంది. ప్రభాస్ గారు దీపిక రణవీర్ సింగ్ గారికి కల్కి లాంటి పాత్ర ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఇది ప్రభాస్ యొక్క సాంప్రదాయ నీతి నియమాలకు, హిందూ ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రభాస్ ఎల్లప్పుడూ తన సినిమాల ద్వారా సమాజానికి సానుకూల సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారని, ఈ నిర్ణయం ఆయన యొక్క గొప్ప మనసును చాటుతుందని అభిమానులు అంటున్నారు.

అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. 'స్పిరిట్' చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లేదా బృందం నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. అయినప్పటికీ, ఈ సంఘటన ప్రభాస్ యొక్క సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని మరోసారి హైలైట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

కానీ వయసులో పెద్దవారు మరియు సినిమా ఇండస్ట్రీ దిక్సూచి అయినా ప్రభాస్ సమీప బంధువు మెగా స్టార్ చిరంజీవి మాత్రం బాలీవుడ్ సంప్రదాయాన్ని మక్కువ తో ఒకసారి చెల్లి పాత్ర వేసిన ఆవిడా మరియు ఇద్దరి పిల్లల తల్లి అయినా హీరోయిన్ తో రొమాన్స్ కి దిగారు ఇది కొసమెరుపు


5/24/2025

తాత్కాలిక థియేటర్‌ల మూసివేత - వీర మల్లు కోసం మోనోపొలీ వ్యూహం?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తాత్కాలిక థియేటర్‌ల మూసివేత: పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు కోసం మోనోపొలీ వ్యూహం

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్ ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి 10 రోజుల పాటు థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రస్తుత రెంటల్ ఆధారిత రెవెన్యూ మోడల్‌పై అసంతృప్తి నేపథ్యంలో వచ్చింది, అయితే ఇది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీర మల్లు చిత్రం కోసం ఒక వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. జూన్ 12న విడుదల కానున్న ఈ చిత్రం, గతంలో వాయిదా పడినప్పటికీ, ఇప్పుడు థియేటర్లు తిరిగి తెరిచినప్పుడు ఒకే చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించే మోనోపొలీ వ్యూహాన్ని అనుసరించనున్నాయి?.



ఈ మూసివేత వ్యూహం ద్వారా హరిహర వీర మల్లు (Hari Hara Veera Mallu) చిత్రానికి హైప్ సృష్టించడంతో పాటు, ఇతర చిత్రాలతో పోటీని తగ్గించి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాకపోయినా కూడా ఆదరణ పొందేలా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యూహం థియేటర్ యజమానులకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రముఖత కారణంగా ఈ చిత్రానికి ఉన్న ఆసక్తిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మోనోపొలీ వ్యూహం ? పరిశ్రమలో ఇతర చిత్రాలకు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి?

12/21/2024

12/21/2024

JSK Janaki vs State of Kerala

  

Suresh Gopi


JSK Janaki vs State of Kerala


సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ




సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పధ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె. ఎస్. కె). బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.




అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి గారు నటించారు. 


ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.




నటీనటులు : సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్


రచన & దర్శకత్వం: ప్రవీణ్ నారాయణన్


నిర్మాత: జె. ఫణీంద్ర కుమార్ 


బ్యానర్: కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ 


సహ నిర్మాతలు: సేతురామన్, హుమాయున్ అలీ అహమ్మద్ 


DOP: రెనదివ్


ఎడిటర్: సంజిత్ మహమ్మద్ 


సంగీతం : గిరీష్ నారాయణన్ , జిబ్రాన్


పి ఆర్ ఓ : మధు VR







Anupama Parameshwaran


Suresh Gopi


12/20/2024

12/20/2024

Deccan Sarkar ఘనంగా జరిగిన మూవీ లాంచ్

'దక్కన్ సర్కార్' (
Deccan Sarkar

Deccan Sarkar) మూవీ పోస్టర్, టీజర్ లాంచ్



కళా ఆర్ట్స్ బ్యానర్‌పై  కళా శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్. తాజాగా ఈ సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మం తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ''తెలంగాణ ఉద్యమంలోని కష్టాలను ఈ సినిమాలో చూపించారు. ఉద్యమంలో పని చేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు. ఉద్య‌మాన్ని చూపిస్తున్న ఇలాంటి సినిమాను ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాలి. చిత్ర‌యూనిట్‌ను అభినందిస్తున్నాను.'' అని అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ''ఇలాంటి సినిమాలను మ‌న‌మంతా ఆహ్వానించాలి. ఈ సినిమాలో నటీనటులు బాగా చేశారు. ఒక సినిమాతో ఎన్నో కుటుంబాల‌కు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఈ సినిమాను హిట్ చేయాల‌ని కోరుతున్నాను. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నా మ‌ద్ద‌తు ఉంటుంది.'' అని అన్నారు.

డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్ప‌ది, ఇక్క‌డి ప్రకృతి ఎంతో బాగుంటుంది. తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మాన్ని తెరపై ఆవిష్క‌రించాము. నిజ జీవితంలో మంచి క్యారెక్టర్ ఉన్న వారినే సినిమాలో క్యారెక్ట‌ర్లుగా తీసుకున్నాను. పోరాటాలకు విరామం ఉండ‌ద‌నే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశాను. సాయి చంద్ , జై శ్రీను వంటి తెలంగాణ ఆణిముత్యాలను కోల్పోయాం. ఉద్య‌మ క‌ళాకారుల‌ను, నా ఆత్మీయుల‌ను ఈ సంద‌ర్భంగా త‌లుచుకోవ‌డం భావోద్వేగంగా ఉంది. 'దక్కన్ సర్కార్' ఆడియో లాంచ్ త్వరలో నిజామాబాద్‌లో భారీగా నిర్వహించబోతున్నాము. ఈ సినిమాను ఆద‌రించాల‌ని ప్ర‌తి ఒక్క‌రిని కోరుకుంటున్నాను. మా సినిమా పోస్టర్, టీజర్ లాంచ్ కార్య‌క్ర‌మంకు వ‌చ్చిన అతిథుల‌కు, తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు, మీడియా మిత్రుల‌కు పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు.'' అని అన్నారు.  

ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం కళా శ్రీనివాస్ ఎంతో శ్రమించారు. సినిమాను తెర‌కెక్కించిన తీరు బాగుంది. సినిమాకు మన అందరి సహకారం అవసరం. చిన్న సినిమాను పెద్ద హిట్ చేయాలి.'' అని అన్నారు.  

నటి హేమ మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకు ఎదుర్కొని ఒక మంచి సినిమాను మ‌న ముందు ఉంచారు. ఈ సినిమాను మ‌న‌మంతా ఆద‌రించాలి.  
హీరో చాణక్య మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ కళా శ్రీనివాస్ త‌న ప్ర‌తిభ‌తో 12 సంవత్సరాల ఉద్యమాన్ని 2 గంటల్లో చూపించారని, తెలంగాణలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవితాన్ని ప్రతిబింభించేలా చిత్రంలోని సన్నివేశాలు ఉంటాయని.. ప్రస్తుత తెలంగాణా స్థితి గతులను ఆధారంగా చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రతీ ఒక్కరు బాధ్యతగా భావించి ఈ చిత్రాన్ని ప్రమోట్వా చేయాలని చెప్పారు.
ఒక గొప్ప ప్రయత్నంగా ఈ సినిమాను చేశారని ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారు కొనియ‌డారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్న





సినిమా అంటూ కీర్తించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు ముఖ్య‌పాత్ర‌లోనూ  డైరెక్టర్ కళ శ్రీనివాస్ పాత్ర ప్ర‌శంసించ‌ద‌గిన‌ద‌ని అన్నారు.

నటి నటులు : చాణక్య, కళా శ్రీనివాస్, కియా రెడ్డి, మౌనిక, ఘర్షణ శ్రీనివాస్, బుగత సత్యనారాయణ, జబర్దస్త్ రాజమౌళి తదితరులు..
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:
క‌ళా శ్రీనివాస్.

బ్యానర్: కళా ఆర్ట్స్
నిర్మాత‌: క‌ళా శ్రీనివాస్
డీవోపీ: భ‌ర‌త్, న‌ర‌హ‌రి
మ్యూజిక్: మ‌ల్లిక్ ఎంవీకే
ఎడిటింగ్: అలోషియ‌స్ సేవియర్ , చాణక్య
డ‌బ్బింగ్: అమూల్య స్టూడియోస్,
డీఏ: తిరు
పీఆర్ఓ: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.


12/20/2024

Mass Hero Sujith Reddy gets International honour

 


విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చేరువైన దూరమైన చిత్ర హీరోకు అవార్డు


యువ హీరో సుజిత్ రెడ్డి రీసెంట్ గా నటించిన చిత్రం "చేరువైన దూరమైన". చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్- 2024 గానూ ఉత్తమ డెబ్యూ హీరో కేటగిరిలో ఎంపికైంది., 

ఆ చిత్రంలో నటించిన సుజిత్ రెడ్డి కి ఉత్తమ డిబ్యు హీరోగా అవార్డు వరించింది.

 డిసెంబర్ 29న దాదాపు 14 దేశాల ప్రతినిధులు పాల్గొనున్న విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో చిత్ర హీరో సుజిత్ రెడ్డికి ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు.