తెలుగు చిత్ర

Breaking

12/20/2024

12/20/2024

Alluri Sitarama Raju జీవిత చరిత్ర ఆధారం

alluri sitarama raju


Alluri Sitarama raju జీవిత కథ మన్యం ధీరుడు
బ్రిటీష్ వారి బాని సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా… వెండితెరపై చూసినా…. కొత్తగానే వుంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించారు. మన్యం ధీరుడు (Alluri Sitarama raju ) పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి.మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) వారి తుపాకీ గుళ్లకు బలై నెలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి… బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు (Alluri Sitarama raju ) వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి… ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్రం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? గూడేళ్లో వున్న పేద ప్రజల్లో వున్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? స్వాతంత్రోద్యమంలో విప్లవ వీరుల కథలను నేటి యువతకూ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. టెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు ఇలాంటి స్వాతంత్రోద్యమకారుల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ… భావి తరాల వారికి చరిత్ర మరిచిపోకుండా చేయడం మనవంతు. గతంలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju ) జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం… వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్ కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.
అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం… బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేశాలన్నీ మాస్ ని అలరిస్తాయి. నటుడు రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా వుంది. మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో… బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే… వాళ్లకు పన్ను ఎందుకు కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అనేక అంశాలను ఇందులో చూపించారు. ఇలాంటి వన్నీ యువతకు బాగా మెసేజ్ ఇచ్చేలా వున్నాయి. ఓవరాల్ గా ఈ మన్యం ధీరుడు (Alluri Sitarama raju ) పేరుతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా… బ్రిటీష్ వారిపై పోరాడిన ఓ విప్లవ వీరుడి కథగా ఆకట్టు ఆకట్టుకుంటుంది.
రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో బాగా ఒదిగిపోయారు. ఆహర్యం, డైలాగ్ డెలివరి, డిక్షన్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా విల్లు విద్యలు నేర్చుకుని నటించడం రియల్ స్టిక్ గా వుంది. ఓ యథార్థకథను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడం అభినందనీయం. అలాగే బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ కూడా చివరి దాకా బాగా నటించారు. అతన్ని విడిపించడానికి సీతారామరాజు చేసే ప్రయత్నం… బ్రిటీష్ వారికి, సీతారామరాజుకు (Alluri Sitarama raju ) మధ్య జరిగే భీకర సన్నిశాల్లో మల్లుదొర పాత్ర కూడా ఎంతో ప్రాధన్యత సంతరించుకుంది. జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా… నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నాచురల్ గా వేశారు. అర్ట్ వర్క్ రిచ్ గా వుంది. సినిమాటోగ్రఫీ చాలా నాచురల్ గా వుంది. మన్యం అందాలు, గూడెం ప్రాంతాలను బాగా చూపించారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. బోర్ కొట్టించి కుండ చేసి… చాలా పకడ్బందిగ చేశారు ఓ విప్లవ వీరుడి కథకు కావాల్సిన యాక్షన్ సీన్స్, సంభాషణలన్నీ చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని తెరకెక్కించారు.

9/12/2022

9/12/2022

అవేంజర్స్: ఎండ్‌గేమ్ చివరికి అవతార్ పై విజయం సాధించింది

అవేంజర్స్: ఎండ్‌గేమ్  చివరికి అవతార్ పై విజయం  



అవతార్ పది సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న  రికార్డు ని, అవేంజర్స్: ఎండ్ గేమ్ బద్దలు కొట్టింది. ఈ  శనివారం మార్వెల్ స్టూడియో యొక్క కామిక్-కాన్ ప్యానెల్‌లో అధికారికంగా ప్రకటించారు, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ ఈ వారాంతంలో అవతార్ యొక్క 2.7897 బిలియన్ల అనగా సుమారు ₹19250 కోట్ల రూపాయల  ప్రపంచ బాక్సాఫీస్‌ను బీట్ చేస్తూ అతిపెద్ద చిత్రంగా మొదట స్థానాన్ని కైవసం చేసుకుంది. నిలిచింది. 



"మీకు ధన్యవాదాలు, అవేంజర్స్: ఎండ్‌గేమ్ ఆల్ టైమ్‌లో అతిపెద్ద చిత్రం" అని కి ఫీజ్ (Fiege) చెప్పారు.

6/26/2016

6/26/2016

ఈ బాబు నిజంగా బంగారం

Babu Bangaram Still

అందరిని ఆకర్షిస్తున్న తాజా చిత్రం బాబు బంగారం. సినిమా అవుట్ అండ్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ జోనర్ తో ముగిసింది. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా మరియు అందాల తార నయనతార అతని ప్రేయసి. డైరెక్టర్ మారుతి ఈ చిత్రంకి  కెప్టెన్. నిర్మాత ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల నుంచి సుమారు 0.86 మిలియన్ల ప్రేక్షకుల ఈ టీజర్ని చూసారు. టీజర్ ఎంత ఆకర్షిస్తుందో తెలుస్తుంది.  

లక్ష్మి, తులసి తరువాత, ఇరువురికి ఇది మూడవ చిత్రం. ప్రధాన నటులు 30 ఇయర్స్ పృథ్వీ, పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిషోర్ ప్రేమ ఆసరాగా ఉంటూ మంచి హాస్య కామెడీ ట్రాక్ నడిపే ఉన్నాయిట. ఈ సినిమాకి  ఇది ఆసక్తికరమైన పాయింట్లు.

ఇది కేవలం ఏ మలుపు లేని సాధారణ కుటుంబం ప్రేక్షకులకు మంచి హాస్య కలిగించే చిత్రం. వెంకటేష్ చాలా రోజుల తరువాత మళ్ళీ ఆడవాళ్లను థియటర్ కు రప్పించే చిత్రం ఇది.  

సంగీత దర్శకుడు ఘిబ్రన్,  ప్రతి సన్నివేశంని ఎలివేట్ చేసేలా దీనికి మంచి నేపథ్య సంగీతం అందించాడు. ఈ టీజర్ లో మంచి రొమాంటిక్ థీమ్ వినిపిస్తుంది దాని అర్థం మరోసారి తనను ప్రూఫ్ చేసుకోబుతున్నాడు.


ఇప్పుడు, సినిమా ఆడియో మరియు సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఆడియో జులై 9న మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో 28న ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

1/19/2016

1/19/2016

ఆసిన్ ను పరిణయమాడిన మైక్రోమ్యాక్స్ “రాహుల్ శర్మ”

Mr & Mrs Asin Rahul Sharma

ప్రముఖ నటి “ఆసిన్ తొట్టుంకళ్ (30)” ని ప్రముఖ వ్యాపారవేత మైక్రోమ్యక్స్ “రాహుల్ శర్మ (39)” క్రైస్తవ (ముందు) మరియు హిందూ (తరువాత) మతం ఆచారాలు విధంగా వివాహం చేసుకున్నారు.  30 ఏళ్ల "గజిని" సుందరి అతి సాధారణ అంగు అర్బాతం లేకుండా కేవలం కుటుంబసభ్యులు మరియు అతి సన్నిహితులు సమక్షంలో ఓక రిసార్ట్ హోటల్ వివాహం జరుపుకున్నది.

మొదట సుమారు ఉదయం 11లకు  కాథలిక్ శైలిలో  వివాహం  జరిగింది. ఈ వేడుకలో వధువు (తెల్ల గౌను), వరుడు (నల్ల సూటు, బో టై లో) క్రైస్తవ సంప్రదాయ బద్దంగా అందంగా అందరిని మయిమరిపించారు.
“ఈ వివాహం అసిన్ కోరిక మేరకు క్రైస్తవ పద్దతిలో అందంగా, అలరించేలా జరిగింది అని, మా అందరికి సంతోషమే అని” ప్రముఖ  వ్యాపారవేత్త వరుడు రాహుల్ శర్మ బంధువు తెలిపారు. “వివాహం నిర్విగ్నంగా జరిగింది అని, అసిన్ తెల్ల గౌన్ లో మరింత అందంగా ఉందని ఈ పెళ్లి కోసం మేము నిన్నటి నుంచి రిహార్సల్ చేసాము అని, ఇంకా 2-3  పాటలు వివాహ జంట కోసం ఆలాపించం అని” సంగీత విధ్వసులు పెరుకున్నారు.   
ఈ పెళ్లి ప్రముఖ బాలివుడ్ సూపర్ స్టార్  మరియు అతి సన్నిహితుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు.  దిల్లికి చెందినా ప్రముఖ Elohim Worship సంగీత బృందం వివాహ సంగీత సారధ్యం వహించారు.  ఈ పెళ్లికి అక్షయ్ మరియు వారి సహకారం  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒక ప్రైవేటు వివాహ గేట్-టుగేదర్ రాహుల్ ఫామ్ హౌస్ వద్ద రేపు జరుగుతాయి భావిస్తున్నారు. తరువాత జంట ప్రతేక్య  రిసెప్షన్ ముంబైలో చేయనున్నరు.

1/17/2016

1/17/2016

తన కుమారులు వారి వైఫల్యలను ఎదుర్కోవాలి అంటున్న నాగార్జున

Nagarjuna Akhil Naga chaitanya


  ఈ సంక్రాంత్రి బాక్స్ ఆఫీసు రాజు "అక్కినేని  నాగార్జున" సోగాడే చిన్ని నాయన విజయాని ఆనందిస్తున్నాడు.  IANS తో అక్కినేని నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూ లో వారి కుమారుల కోసం కొన్ని విషయాలు చెప్పారు. అది ఏంటంటే "వారు తమ పూర్తి సమయం నటన కేటాయించటం, వారి పాత్ర, చిత్ర ఎంపిక మరియు  వారి జయ అపజయలను మరియు వారి వైఫల్యాలు పరిష్కరించేందుకు పూర్తి స్వయ బాధ్యత వారికే ఇచ్చారు. ఇందులో తను ఎటువంటి జోక్యం చేసుకోనని చెప్పరు.  వారి వైఫల్యాలను  పరిష్కారించే సామర్ధ్యం వారికి రావాలని కోరుకుంటున్నా . నాకు చాల ఫ్లాప్స్ ఉన్నాయి, నేను వాటిని నేర్చుకున్నాటు వాళ్ళు కూడా వారి ఫ్లాప్స్ నుంచి వారు నేర్చుకోవాలని తనలాగా 

గత సంవత్సరం, నాగార్జున శోభాయమానంగా తన రెండో కుమారుడు అఖిల్ ని తొలి చిత్రం "అఖిల్"  తో తెరగేట్రం చేసారు . కానీ, అది అందరిని నిరాశపరిచింది.
  
"ఆ చిత్రం మంచి చెడో తెలిదు, కానీ మేము అందరమూ పూర్తిగా నిరాశే చెందాము. నేను, ఆ షాక్ నుంచి తేరుకోవటానికి వారాలు పట్టింది. మేము ఆ పరాజయాని అంగీకారించము , "అని  అన్నారు.                                        

నాగార్జున తన కుమారులు సినీ ఎంపికలో జోక్యం చేసుకోబోమని అని చెప్పారు అయితే, అతను ఎల్లప్పుడూ సలహాలను ఇవ్వడానికి  ఇష్టమని చెప్పారు.

"నాగచైతన్య ప్రస్తుతం మలయాళం సూపర్హిటైన “ప్రేమం”  చిత్రంను  తెలుగులో  "మజ్ను", పేరుతో రీమేక్  చేస్తున్నారు.  నేను “ప్రేమం” చూసినప్పుడు, నాకు ఒక అందమైన చిత్రంగా అనుభూతి కలిగింది, చైతన్యకు ఈ చిత్రం పరిపూర్ణంగా సరితుగుతాడు అని మేము అది రీమేక్ నిర్ణయించుకున్నాము, కానీ తనపై ఎటువంటి ఒత్తిడి పెట్టలేదు. "

అక్కినేని త్రయం స్వర్గీయ నాగేశ్వర రావు, నాగార్జున మరియు నాగ చైతన్య 2014 లో మనంచిత్రంలో నటించారు.  మరోసారి  అలాంటి అవకాశం వస్తే తను తన కొడుకులతో నటించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు.

నాగార్జున కోరుకున్న విధంగా నాగ చైతన్య మరియు అఖిల్ ఇద్దరు మనో దైర్యంతో ముందడుగు వేసుకుంటూ భవిష్యతులో విజయాలు పొందాలని అభిమానులు కోరుకుందాం.

12/20/2015

12/20/2015

ప్రముఖ తెలుగు సినీ సీనియర్ నటుడు రంగనాథ్ స్వర్గస్థులయ్యారు

Actor Ranganath still

ప్రముఖ నటుడు రంగనాథ్ గారు నేటి సాయంత్రం కవాడిగూడ అయన నివాసంలో తుది శ్వాస విడిచారు. వారి వయసు 66 సంవత్సరాలు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రంగనాథ్ గారి పూర్తీ పేరు "తిరుమల సుందర శ్రీ రంగనాథ్", 1949 మదరాసులో జన్మించారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వా విద్యాలయంలో B.A. పట్టా పొందారు. తదనంతరం భారతీయ రైల్వే లో టికెట్ కలెక్టర్ గా పని చేశారు. 


1969లో బుద్ధిమంతుడు అను  చిత్రంలో చిన్న పాత్రలో మెరిసారు. తరువాత ప్రముఖ నటుడు గిరి బాబు గారి ప్రోత్సాహంతో చందన చిత్రంలో కథానాయకుడిగా అవకాశం వచ్చింది. అలా మొదలైన ప్రస్థానం  జామిందరుగారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటింటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందామే  ఆనందం మొదలుకొని సుమారు 300 వందల చిత్రలలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ  నటుడిగా అందరి మన్ననలు పొందారు.  ఆయన చివరి చిత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర

తెలుగు చిత్రాలతోనే పరిమితం కాకుండా బుల్లి తెరలోను తన ఉనికి చాటుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన శాంతి నివాసం మొదలు కొని, ఇద్దరు  అమ్మాయిలు, అత్తో అత్తమ్మ కూతురో ధారావాహికం లో నటించారు. 


రంగనాథ్ గారు నటనలో బిజీగా  ఉన్న వారు అటతుగా ఇవాళ సాయంత్రం మృతి చెందారు. వారు ఆత్మాహత్య చేసుకున్నారు. వారు చనిపోవటం చలనచిత్ర నటులు ఆత్మీయులను కోల్పోయాము అని దిగ్బ్రాంతి చెందుతున్నారు. వారికి మృతికి సిని పెద్దలు, సిని మండలి ప్రగడ సంతాపం తెలుపుతున్నారు. వారితో పాటు మా తెలుగు చిత్రా కూడా మహా నటుడికి ఘన నివాళి. 


 ..  తన ఆత్మ శాంతి కలగాలని తెలుగు చిత్రా దేవుని ప్రార్ధిస్తుంది ..